TG: హైదరాబాద్ ఎర్రగడ్డలో దారుణం చోటుచేసుకుంది. రాజు అనే వ్యక్తి 51 ఏళ్ల జీహెచ్ఎంసీ కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ESI ఆస్పత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరగ్గా.. బోరబండ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.