HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై పారిశుద్ధ్య కార్మికులపై అత్యాచారం జరిగింది. దీంతో మహిళ ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించగా.. రాజు అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.