WGL: మామునూరు టీజీఎస్పీ 4వ బెటాలియన్ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 457 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కమాండెంట్ రామ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ హాజరవుతారన్నారు.