KNR: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో గురువారం స్వశక్తి మహిళా సంఘం భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంఘ భవనం ద్వారా వారి కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.