MBNR: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మ్యాథమెటిక్స్, జువాలజీ, హిస్టరీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 254 మంది గైర్హాజరైనట్టు జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పరీక్షకు మొత్తంగా 10156 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9902 విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.