NLG: తిరుమలగిరి సాగర్(మం) బోగ్యతండాలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ లేకపోవడంతో కరెంట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మంచి నీటి సరఫరా అంతంత మాత్రమే అని, కరెంట్ సమస్య వల్ల సరఫరా మరింత తగ్గి నీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.