MHBD: మరిపెడ మండలంలోని ఆనేపురం గ్రామంలో సవారి లచ్చమ్మ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు చెెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని విప్ తెలిపారు.