JN: జిల్లాలోని రైతులు ఈ నెల 28వ తేదీలోపు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాలు పొందేందుకు ఈ నమోదు అవసరమని స్పష్టం చేశారు. ఇంకా నమోదు చేసుకుని రైతులు ఏఈవోల వద్ద లేదా మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.