NLG: నల్గొండ పట్టణానికి చెందిన గూడూరు జానకీరాంరెడ్డి కుమార్తె వివాహ వేడుకకు ఆదివారం ఎమ్మెల్యే వేముల హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లిలో రామోజు, సందీప్ కుమారుల పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిన్నారులను దీవించారు. అలాగే నకిరేకల్ మండలం మండలపురంలో సుఖేందర్ రెడ్డి కుమార్తె డోలహోరణలో పాల్గొని ఆశీర్వదించారు.