MBNR: రాజాపూర్ మండలంలో మొదటి విడతగా 13 గ్రామపంచాయతీలకు చెందిన నూతన వార్డు సభ్యులకు గత 5 రోజులుగా మండలంలోని రైతు వేదికలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. వార్డు సభ్యులకు ఎంపీడీవో విజయలక్ష్మి సర్టిఫికెట్స్ అందజేశారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామాలలో వార్డు సభ్యుల విధులు, అభివృద్ధిపై అధికారుల శిక్షణ తమకు చాలా ఉపయోగపడుతుందన్నారు.