BDK: దీపావళి పండుగను ఆనందంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఆదివారం కోరారు. టపాసులు పేల్చేటప్పుడు నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు పేల్చాలని, గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్ వంటి ద్రవ ఇంధనాల సమీపంలో టపాసులు కాల్చొద్దని ఆయన పేర్కొన్నారు.