BHNG: బీబీనగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ మందగించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పేరుకుపోగా, వర్ష సూచనలతో రైతుల్లో భయం నెలకొంది. ధాన్యం తడిస్తే భారీ నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.