SDPT: రూ. లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కళ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే విమర్శించే వారికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. బుధవారం గలగల పారుతున్న కాలువల వద్ద ఆయన సెల్ఫి తీసుకున్నారు.