WGL: ప్రతిష్ఠాత్మక కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో విద్యార్థుల మధ్య గొడవలు, ఘర్షణలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రశాంత వాతావరణం ఉండే క్యాంపస్లో ఇప్పుడు అస్థిరత నెలకొంది. నిన్న యూనివర్సిటీలోనే చికెన్ కోసం విద్యార్థులు కర్రలతో కొట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పర్యవేక్షణ లేక గొడవలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.