MDCL: మేడిపల్లి పరిధిలోని సాయి ప్రియ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామస్వామి (శివాలయం & రామాలయం) దేవాలయ నిర్మాణ పనులకు పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి రూ. 1,00,116లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవచింతన సమాజంలో శాంతిని, ఐకమత్యం పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.