NGKL: బిజనపల్లి మండలం మాన్య నాయక్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ఇళ్లను పరిశీలించిన ఆయన, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.