NDL: కొత్తపల్లిలోని కేజీబీవీ పాఠశాలను మలేరియా అధికారులు బుధవారం తనిఖీ చేశారు. వంటశాల పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దోమల వ్యాప్తిపై నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వంట గదిలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులు దోమ కాటుకు గురికాకుండా దోమతెరలను వాడాలని సూచించారు.