BDK: ITDA పీవో బి.రాహుల్ ఆదేశాల మేరకు కిన్నెరసాని (బాలుర) కాంచనపల్లి(బాలికల) క్రీడా పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఈనెల 16,17 తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆళ్లపల్లి HM శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో ఉదయం 8:30 గంటలకు హాజరుకావాలని కోరారు.