NLG: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ముత్యాల తలంబ్రాలను ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేక సేవలను తెచ్చినట్లు దేవరకొండ డిపో మేనేజర్ విజయకుమారి శనివారం తెలిపారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు. భక్తులు రూ. 151 చెల్లిస్తే ఇంటి వద్దకు అందించడమే లక్ష్యమని తెలిపారు. బుకింగ్ కోసం ఆర్టీసీ కార్గోలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.