MNCL: తాండూర్ మండల కేంద్రానికి చెందిన సాయి సృజన్ గౌడ్ పై దాడి చేసిన కాయిత శ్రీ నిఖిల్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు SI కిరణ్ కుమార్ తెలిపారు. IB ప్రాంతంలో జరిగిన గొడవలో సృజన్ గౌడ్ను, కాయిత శ్రీ నిఖిల్ గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిఖిల్ను అరెస్టు చేశామన్నారు. నిఖిల్ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్సై వెల్లడించారు.