సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద నిర్మిస్తున ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 2 సర్వీస్ రోడ్డు నిర్మాణం పనులను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు.