వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరసింహ, టీచర్స్, భగీరథ, సాగర్ కాలనీలలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా ఇవాళ జరిగింది. ఈ వేడుకకు భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమం విజయవంతానికి తోడ్పడిన ప్రజాప్రతినిధులు, స్థానికులు, భక్తులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.