KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఆర్పీలు అవినీతికి పాల్పడితే సహించబోమని ఛైర్మెన్ మొలుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ మహమ్మద్ అయాజ్ హెచ్చరించారు. బుధవారం జరిగిన సమావేశంలో SHG రుణాల విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఎవరైనా లోన్స్ ఇప్పించే క్రమంలో కమీషన్ డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఫిర్యాదు చేయాలన్నారు.