NGKL: జిల్లా ఆసుపత్రిలో ఇటీవల కుమ్మెర గ్రామానికి చెందిన చిన్నారి మరణించిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ కె.రవికుమార్ విచారణ చేపట్టారు. మృతికి దారితీసిన పూర్వాపరాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ విచారణలో తాడూరు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ అభిరామ్, గైనకాలజిస్టులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.