SRD: సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగుల కోసం 7వ తేదీన సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శనివారం తెలిపారు. శిబిరంకు సంబంధించిన స్లాట్ ఈనెల 31వ తేదీన విడుదల చేస్తామని పేర్కొన్నారు. మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.