కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదానం భవన నిర్మాణానికి మంగళవారం తుని వాస్తవ్యులు దాడిశెట్టి విష్ణు, రామజ్యోతి రూ. 2,20,000 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.