MHBD: దీపావళి పండుగను ఆనందంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ సూచించారు. టపాసులు పేల్చేటప్పుడు నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు పేల్చాలని, గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్ వంటి ద్రవఇంధనాల సమీపంలో టపాసులు కాల్చరాదని సూచించారు. అనుమతి లేకుండా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయొద్దన్నారు.