NLG: శ్రీ శ్రీ శ్రీ భూసమేత తిరుమలనాధస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు గురువారం పున్న రాములు భారతమ్మ దంపతులు అన్న ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ముందు స్వామివారికి ‘నైవేద్యం’ సమర్పించారు. కళ్యాణానికి విచ్చేసిన దాదాపు 6,000 మంది భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. నిర్వహకులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.