ADB: గుడిహత్నూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను ఆయన నివాసంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.