NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చర్చే ప్రధానాంశంగా మారింది. సిటీకి సమీపంగా ఉండటంతో ఇక్కడి నాయకులు హైద్రాబాద్లో మకాం వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, జిల్లాకు చెందిన నేతలు తమ పార్టీ అభ్యర్థుల తరపున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి నాయకులంతా అక్కడే అంటూ… సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది.