KMM: నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన భూక్య బిక్షాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా శుక్రవారం సీఎం సహాయ నిధి ద్వారా నగదు మంజూరు అయింది. ఈ నేపథ్యం లో ఆ చెక్కును గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రవీణ్ చేతుల మీదుగా లబ్ధిదారుడికి అందజేశారు.