SDPT: కోహెడ మండలం గుండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో గత కొద్దిరోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరాను సర్పంచ్ పిల్లి బాబు పునరుద్ధరించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో బోరు పాడై విద్యార్థులు, కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తక్షణమే మరమ్మతులు చేయించారు. సకాలంలో స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్థులు పంచాయతీకి కృతజ్ఞతలు తెలిపారు.