HYD: ప్రముఖ మీర్ ఆలం ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పెద్దఎత్తున తరలివచ్చిన ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ ఈద్గాను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించిన ఆయన, ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకున్నారు.