NGKL: పెంట్లవెల్లి మండలం గోపులాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీని ఎంపీడీవో నాగేంద్రం, ఏపీవో మోహన్ కృష్ణ శనివారం పరిశీలించారు. నర్సరీలోని మొక్కలను ఎండల నుంచి సంరక్షించేందుకు వెంటనే షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామస్థులకు ఉపయోగపడే పండ్ల, పూల మొక్కలను అధికంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.