KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ఆలయానికి సంబంధించిన 3 పెద్ద ఆవులను, 9 ఆవు దూడలు ఎవరో గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారని జుక్కల్ గ్రామస్తులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవులు అపహరణకు గురయ్యాయని అన్నారు. 9 ఆవుల విలువ దాదాపుగా రూ. 90 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.