MLG: ఏజెన్సీలోని SC, ST, BCలు తరతరాలుగా సాగుచేస్తున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ద్వారా వారిని వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని TDP జిల్లా అధ్యక్షుడు దేవా నాయక్ ఆరోపించారు. ఛత్తీస్గడ్ నుంచి వచ్చినవారితో అడవులను నాశనం చేస్తున్నారన్నారు. తమపై దాడులు ఆపాలని, ఉక్కుపాదం మోపడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రేపటి దళిత సభకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.