NLG: వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో నల్గొండ ఎండలతో మంటలెత్తుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరడంతో ఉక్కపోత తీవ్రంగా ఉంది. వేడి తట్టుకోలేక ప్రజలు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ప్రకాశం బజార్, హైదరాబాద్ రోడ్ ప్రాంతాల్లో వారం రోజులుగా కూలర్లు, ఏసీల విక్రయాలు సుమారు 40 శాతం పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.