SDPT: కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్, పిల్లల వైద్య నిపుణులు, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారు. వివిధ గ్రామాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.