MHBD: మహబూబాబాద్ పట్టణంలో రైల్వేమెగా ఫ్రెయిట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని సాధన కమిటీ ప్రతినిధులు నేడు సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మల్లాడిని కలిసి విజ్ఞప్తి చేశారు. డిపో కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాదనలను రైల్వే బోర్డు ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు.