SRPT: మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం, కృష్ణానగర్ గ్రామాల మద్య రామాపురం గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీలక్ష్మి నర్సింహ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం బుధవారం మండల పరిధిలోని బరాఖాత్ గూడెం గ్రామంలో స్వామి వార్లను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు బేతం రామిరెడ్డి, చల్లా గురవయ్య,వెంకటేశ్వర్లు, భక్తులు పాల్గొన్నారు.