పెద్దపల్లి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో రామగిరి, జూలపల్లి, ధర్మారం మండలాలలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. వచ్చే 5 నుంచి 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.