NLG: శాంతి భద్రతల విషయంలో పోలీసులు రాజీ పడొద్దు అని DSP శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అక్రమ ఇసుక రవాణాను నివారించాలని, ఫిర్యాదు దారుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CI కొండల్ రెడ్డి, SI సైదులు, తదితరులు పాల్గొన్నారు.