MNCL: రైతులు పంటలలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని జన్నారం మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పొలాల్లో వివిధ పంటలు చేశారని, ఆ పంటల్లో గడ్డి, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయన్నారు. వాటి వల్ల పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పొలాల్లో పెరిగే గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలని ఆయన సూచించారు.