SRPT: ముస్లింల పవిత్ర పండగ రంజాన్ను పురస్కరించుకుని మఠంపల్లి(మం) పెదవీడులో గల కౌసర్, మదీన మస్జీద్ల ఆవరణలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీం పాల్గొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేయండం ఎంతో భాగ్యమన్నారు.