NRPT: మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామ శివారులో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి 10 ట్రాక్టర్ల అక్రమ ఇసుకను సీజ్ చేశారు. ఎస్సై అశోక్ బాబు అనుమతులు లేకుండా ఇసుక నిల్వ, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులు అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తారని తెలిపారు.