మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పంది పిల్లను రక్షించి మండల పశువైద్యాధికారి మణికుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. కుక్కలు వెంటాడి కరవడంతో పంది పిల్లకు వెన్నుపై తీవ్ర గాయాలయ్యాయి మరియు వెనుక కాలు ఎముక విరిగింది. ఇది గమనించిన వైద్యాధికారి వెంటనే కుక్కలను తరిమివేసి, పంది పిల్లకు అవసరమైన ఔషధాలు అందించారు.