MBNR: జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో భోజనం చేసి వసతులను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల మెలకువలు నేర్పించి, సందేహాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులను ధైర్యపరిచారు.