GDWL: జిల్లాకు నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ వస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి గురువారం పేర్కొన్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గట్టు మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు సమీక్షిస్తారని తెలిపారు. అలాగే 3 గంటలకు కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ చేస్తారని తెలిపారు. పర్యటనను బీజేపీ నాయకులు విజయవంతం చేయాలని కోరారు.