SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. హత్నూరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాలికలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే నేరుగా పోలీసులను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.