JN: మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసిన ఆయన సేవలు అపారమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ వంటి మహా నాయకుడు ఈ లోకాన్ని విడిచిపోవడం దేశానికి తీరని నష్టమని అన్నారు.